రామ్‌గోపాల్‌ వర్మకు మరోసారి జరిమానా విధించిన జిహెచ్‌ఎంసి

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) అధికారులు వరుసగా రెండోసారి జరిమానా విధించారు. ఇటీవల ఆయన చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఈ నెల 22న రూ.4 వేలు జరిమానా విధించింది. అయితే ఇదే పాంతంలో సుమారు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో జిహెచ్‌ఎంసి సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ రూ.88 వేలు చెల్లించాలని ఈ-చలానా జారీ చేసింది. కాగా, లాక్‌డౌన్‌ అనంతరం మొదటి పోస్టర్‌ అంటూ ట్విటర్‌లో ఆర్‌జివి ఇటీవల పెట్టిన పోస్ట్‌ను ఒక నెటిజన్‌ సిఇసి-ఇవిడిఎం ఖాతాకు ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.