వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు వరుసగా రెండోసారి జరిమానా విధించారు. ఇటీవల ఆయన చిత్రం ‘పవర్స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జిహెచ్ఎంసి అధికారులు ఈ నెల 22న రూ.4 వేలు జరిమానా విధించింది. అయితే ఇదే పాంతంలో సుమారు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో జిహెచ్ఎంసి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ రూ.88 వేలు చెల్లించాలని ఈ-చలానా జారీ చేసింది. కాగా, లాక్డౌన్ అనంతరం మొదటి పోస్టర్ అంటూ ట్విటర్లో ఆర్జివి ఇటీవల పెట్టిన పోస్ట్ను ఒక నెటిజన్ సిఇసి-ఇవిడిఎం ఖాతాకు ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.