రైతులపై నోరుపారేసుకున్న కంగనా

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నోరుపారేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని పేర్కొన్నారు. ఢిల్లీ హింసపై బిజెపి యువమోర్చా ప్రధాన కార్యదర్శి సౌరబ్‌ చౌదరి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలను షేర్‌ చేసిన కంగనా.. తన తల సిగ్గుతో వేలాడుతోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడలేకపోయామని, ఈ ఘటనలపై తీవ్రంగా కలత చెందానని, ఇవాళ తాను విఫలమయ్యానని అంటూ ట్వీట్‌ చేశారు.