తమిళ హీరో ధనుష్, సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ’18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకొని మా ప్రయాణాన్ని కొనసాగించాం. అయితే ఇప్పుడు మేము విడిపోవాలని నిర్ణయించుకొని..వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’ అని ధనుష్ ట్విటర్లో పోస్టు చేసిన లేఖలో పేర్కొన్నారు.మరోవైపు ధనుష్ పోస్టు చేసిన లేఖనే ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ లేఖకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితి అర్థం చేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని ఐశ్వర్య పేర్కొంది.