విదేశాంగమంత్రికి సీఎం జగన్‌ లేఖ
విదేశాంగమంత్రికి సీఎం జగన్‌ లేఖ

విదేశాంగమంత్రికి సీఎం జగన్‌ లేఖ

కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్‌ జగన్‌ కోరారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు