రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకుడు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని గురువారం చిత్ర బృందం సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేస్తున్నామని సాయి పల్లవి పోస్టర్ను విడుదల చేసింది. ఇప్పటికే రానా పాత్ర రవన్న పేరుతో ఓ వీడియోను గతంలో చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి ..వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రిియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.