విశాఖలో ఒక్కరోజే 14 కరోనా కేసులు

విశాఖలో ఒక్కరోజే 14 కరోనా కేసులు

ఏపీలో కరోనా పంజా విసురుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ జిల్లాను ఈ మహమ్మారి వణికిస్తోంది.. జిల్లాలోని అనకాపల్లిలో ఒకే రోజు (శుక్రవారం) లో ఏకంగా 14 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని శాంపిల్స్ రిపోర్ట్స్ రావాల్సి ఉండగా.. మరికొందర్ని క్వారంటైన్‌కు తరలించారు. చింత వీధిలో ఓ వ్యాపారి, మరో డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేసే వ్యక్తికి కరోనా సోకింది. ఆ కాంటాక్టులతో మరో 12మందికి వైరస్ సోకింది. వ్యాపారి కుమారుడు, ఇంట్లో పనిచేసే పనిమనిషి, షాప్ క్యాషియర్, మరో డాక్టర్, అతడి సోదరుడు, మెడికల్ షాపు యజమానికి పాజిటివ్ తేలింది.. కసింకోటలో మరో వ్యక్తికి పాజిటివ్ తేలింది. వెంటనే ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.