సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌
సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

సీఎంలతో మోదీ, అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం ప్రారంభమైంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రానున్నాయి