స్పెషల్‌ జెట్‌లో ఉదయ్ పూర్ కు మెగా ఫ్యామిలీ

నిహారికకు, గుంటూరు ఐజి జె. ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యకు డిసెంబరు 9న రాజస్థాన్‌ ఉదయ్ పూర్‌లో పెళ్లి జరగనుంది. మంగళవారం మెహందీ, సంగీత్‌ వేడుకలు జరగనున్నాయి. అందుకుగాను నాగబాబు కుటుంబం సోమవారం స్పెషల్‌ జెట్‌లో బైలుదేరి వెళ్లారు. ఫ్లైట్‌లో వరుణ్‌ తేజ్‌, నిహారిక, నాగబాబు, చైతన్య, పద్మజలు ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గత కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్లు హైదరాబాద్‌లోని వారి ఇంటిలో ఘనంగా జరుపుకున్నారు.