హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట

 హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది. ఐఏఎస్‌లకు విధించిన సేవా శిక్షను 8 వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కోర్టు ధిక్కరణ కింద 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు సింగిల్‌ జడ్జి సేవాశిక్ష వేసింది. ఈ శిక్షను డివిజనల్‌ బెంచ్‌లో గతవారం ఇద్దరు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. సేవాశిక్షను 8 వారాలపాటు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. సేవాశిక్షను ధర్మాసనంలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. జస్టిస్‌ అసదుద్దిన్‌ అమానుల్లా నేతఅత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆరుగురు ఐఏఎస్‌ల సేవాశిక్షను 8 వారాలు సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు కోర్టు వాయిదా వేసింది