Monthly Archives: April 2021

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పోస్టర్‌ విడుదల

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్‌ విడుదల చేశారు. రష్మికకు జంటగా శర్వానంద్‌ నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Read More »

అక్ష‌య్‌ కుమార్ కు కరోనా పాజిటివ్

కరోనా బారినపడిన బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్ష‌య్‌ కుమార్‌, వైద్యుల సలహామేరకు సోమవారం ఉదయం ముంబైలో హిరానందాని హాస్పిటల్‌లో చేరారు. ముందు జాగ్రత్త చర్యగా, వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరినట్లు తాజాగా అక్ష‌య్‌ తన ట్విట్టర్‌లో ప్రకటించారు.   లక్ష్మీ మూవీ షూటింగ్‌ సమయంలో అక్ష‌య్‌కి మొదటిసారి కరోనా సోకింది. ఆయనకు మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు నిన్న (ఆదివారం) అక్షరు ట్వీట్‌ చేశారు.

Read More »

‘లవ్ స్టోరీ’ కి లాక్ డౌన్ బ్రేక్ పడుతుందా…?

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇందులో హీరోయిన్ సాయిపల్లవి. ఈ రౌడీబేబీకి దక్షిణాదిన మంచి మార్కెట్ ఉంది. అందుకే ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు తమ సినిమాను కన్నడ, మలయాళ భాషల్లోనూ అనువదించి ఒకేసారి ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల ముందు చిత్రం ‘ఫిదా’లోనూ వరుణ్ తేజ్ కంటే సాయిపల్లవే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. అందుకు ఉదాహరణ ‘సారంగధరియా’ పాట. ఈ పాట ...

Read More »

ప్రముఖ సంగీత దర్శకుడికి కరోనా

ప్రముఖ సినీ సంగీత దర్శకులు, సింగర్‌ బప్పిలహరి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం బప్పిలహరి ముంబయిలోని బ్రీచ్‌ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… అనుకోకుండా ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బ్రీచ్‌ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని బప్పిలహరి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినట్లు ప్రతినిధి తెలిపారు. తాను త్వరగా కోలుకుని బయటకు రావాలని దేశ, విదేశాల్లో ...

Read More »