Monthly Archives: August 2021

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా..?

 హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎప్పుడు? ఎన్నికల కమిషన్‌ ఏమి ఆలోచిస్తున్నది? ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాల ఉపఎన్నికలకు ఇప్పుడప్పుడే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నదా? దీనిపై రాజకీయవర్గాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. హుజురాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అదిగో.. ఇదిగో అంటూ సోషల్‌ మీడియాలో రోజుకో తేదీ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఈ నెల 9న దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ‘ఎన్నికల సమయంలో పాటించాల్సిన కొవిడ్‌ నియమాల గురించి ...

Read More »

‘ఒరేయ్‌ బామ్మ‌ర్ది’ మూవీ రివ్వ్యూ

బొమ్మరిల్లు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్థ్‌. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాలతో అలరించి, తెలుగు తెరకు గ్యాప్‌ ఇచ్చాడు. తనదైన నటనతో యూత్ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న ఆయన.. ఈ గ్యాప్‌లో కొన్ని తమిళ సినిమాలు నటించి, వరుస పరాజయాలను మూటగట్టుకున్నాడు. తాజాగా  ‘ఒరేయ్‌ బామ్మర్ది’ అంటూ ఓ డిఫరెంట్ తెలుగు సినిమాతో రంగంలోకి దిగాడు. తమిళ సినిమా ‘శివప్పు మంజల్ పచ్చై’సినిమాకు రీమేక్‌ ఇది. ‘బిచ్చగాడు’ఫేమ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా, ప్రముఖ ...

Read More »

జూన్‌ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి: జగన్

జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. శాశ్వత భూహక్కు-భూరక్షపై ఆయన గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.

Read More »

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మహేశ్‌ దంపతులు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ దంపతులు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి అండగా నిలుస్తున్నారు. ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ దంపతులు తమ సేవ కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్‌ అనే హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత  సిరివెన్నెల సీతారామ శాస్త్రి,  యాంకర్ సుమ ...

Read More »

జగన్‌ను కలిసిన హాకీ క్రీడాకారిణి రజని

భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, గోల్ కీపర్ రజని బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులతలో కలసి ఆమె సీఎం జగన్ ను కలిశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఘనత సాధించి. రజని స్వగ్రామం తిరుపతి సమీపంలోని చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం గ్రామం. భారత్ తరపున 110 అంతర్జాతీయ హాకీ మ్యాచులలో రజనీ గోల్ కీపర్ గా ప్రాతినిధ్యం వహించారు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ తోపాటు.. తాజాగా టోక్యోలో ...

Read More »

రహస్యంగా ప్రియుడితో నయనతార నిశ్చితార్థం

దక్షిణాది లేడి సూపర్‌ స్టార్‌గా పేరొందిన నయనతార, ప్రముఖ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. నయనతార ప్రస్తుతం ‘నెత్రికన్‌’ సినిమాలో నటిస్తోంది. రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్‌లో తాజాగా నయనతార పాల్గొంది. ఈ సందర్భంగా నయనతార ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు నిశ్చితార్థమైందని సిగ్గు పడుతూ తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాన్ని చూపించింది. ఇక పనిలో పనిగా తనకు కాబోయే భర్తపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. ‘విఘ్నేశ్‌ మనసు చాలా మంచిది, తను ఎంతో మంచి ...

Read More »

లోక్‌సభలో ఒబిసి బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు!

రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే, వెనుకబడిన తరగతులకు (ఒబిసి) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 172వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు అంతకుముందే మద్దతు ప్రకటించడంతో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా చర్చలో పాల్గొన్నాయి. నిజానికి పెగాసస్‌ వ్యవహారం, నూతన సాగు చట్టాల రద్దు అంశంలో రెండు వారాల నుంచి పార్లమెంట్‌లో ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం ...

Read More »

మహేశ్‌ ‘సర్కారువారి పాట’ బ్లాస్టర్‌ రికార్డ్‌

మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ‘బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. మహేశ్ బాబు రొమాంటిక్ లుక్ .. లవర్ ను ఫాలో అవుతూ మురిసిపోయే ఎక్స్ ప్రెషన్స్ .. యాక్షన్ సీన్ లో నీట్ గా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ .. చివర్లో ఆయన ...

Read More »

గిరిజనులతో కలిసి ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి నృత్యం

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్‌ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్‌ కలెక్టర్‌ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్‌, మున్సిపల్‌ చైర్పర్సన్‌ గౌరీశ్వరి తదితరులు పాల్గన్నారు.

Read More »

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే బ్లాస్టర్ ని విడుదల చేశారు ఫిల్మ్ ...

Read More »