Monthly Archives: December 2021

కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ పెళ్లికి ఓటీటీ సంస్థ క్రేజీ ఆఫర్

ఓ భారీ బడ్జెట్ చిత్రం ఓటీటీలో ప్రసారం చేయాలన్నా కూడా ఆ చిత్ర నిర్మాతకి అంత ముట్టజెప్పదేమో.. కానీ ఓ బాలీవుడ్ జంట వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ప్రసార హక్కుల కోసం ఓటీటీ సంస్ధ వీరిద్దరితో బేరసారాలు సాగిస్తోంది. భారీ ఆఫర్‌ను ఎరజూపింది. ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 9న వివాహం చేసుకోబోతున్నారు. సెలబ్రెటీల వివాహం అంటే సామాజిక మాధ్యమాలకు పండగే. ప్రతి చిన్న విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. ఫోటోలకు, వీడియోలకు ...

Read More »

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన జగన్

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘నేడు బాబా సాహెబ్ వ‌ర్ధంతి. ఆయన భావాలకు ఏనాటికీ మరణం లేదు. గత 100 సంవత్సరాలుగా భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ అంశాల మీద ఆయన ముద్ర చెక్కుచెదరలేదు. సామాజిక న్యాయంతో కూడిన స్వాతంత్య్రం, సమానత్వాలకు ఆయన చెప్పిన అర్థం ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో మనసా వాచా కర్మణా సాకారమవుతోంది’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ ...

Read More »

సేవా కార్య‌క్ర‌మాల్లో సుమ కనకాల

తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరియాన్ వ్యక్తి యాంకర్ సుమ. యాంకర్ గా గత 20 ఏళ్లుగా మన ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన సుమ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ప్రజలకు, ఇండస్ట్రీ లో ఉన్న పేద కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు సుమ. ఇటీవల దసరా సందర్భంగా సుమ ఈ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున ప్రజ్వల అనే మరో సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న ...

Read More »

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.

Read More »

అడివి శేష్‌కు బాలీవుడ్‌ అవకాశం

టాలీవుడ్‌లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో హీరో అడివి శేష్‌ ఒకరు. క్షణం, గూఢాచారి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్‌ అయిన శేష్‌ తన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందని వెల్లడించారు. ”నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. త్వరలోనే ఈ సినిమాలను ప్రకటిస్తాను” అన్నారు. ప్రస్తుతం శేష్‌, శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో ‘మేజర్‌’ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి తర్వాత మలయాళంలోకి డబ్‌ ...

Read More »

మరో 10 రోజుల్లో పిఆర్‌సి ప్రకటిస్తాం..

మరో 10 రోజుల్లో పిఆర్‌సిని ప్రకటిస్తామని ఎపి సిఎం జగన్‌ శుక్రవారం పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సిఎం తిరుపతిలో పర్యటిస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు ఆయనను కలిసి.. తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన సిఎం.. పిఆర్‌సి ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని  ఉద్యోగ సంఘాలకు హామీ  ఇచ్చారు.  

Read More »

‘రాధేశ్యామ్‌’ నుంచి రెండో పాట

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ‘రాధేశ్యామ్‌’ సినిమా నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ఆషికీ ఆ గయా సాంగ్‌ను బుధవారం (డిసెంబర్‌ 1) విడుదల చేశారు మేకర్స్‌. పాట ఆరంభంలో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?’ అని పూజా, ప్రభాస్‌ను అంటే.. ‘అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్‌ బదులిస్తాడు. దీనికి ‘కానీ, నేను జూలియెట్‌. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్‌’ అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ‘కానీ నేను ...

Read More »

వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌ పర్యటన

వరద బాధితులతో నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది  వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.​ వరదలతో చాలా నష్టం జరిగిందనే విషయాన్ని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు.

Read More »

‘పుష్ప’లో సమంత స్పెషల్ సాంగ్

అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం ఆయన, సమంతల మధ్య వచ్చే ఐటమ్‌ సాంగ్‌ని రామోజీ ఫిల్మ్‌ సిటీలోని భారీ సెట్‌లో షూట్‌ చేస్తున్నారు. ఈ మేరకు సామ్‌ పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్‌గా ఉండబోతోంది అని తెలిపింది. ఈ పోస్టర్‌లో సామ్‌ రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ…ముందుకు తిరిగి ఉంది. హిందీ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య ప్రస్తుతం సెట్‌లో అల్లు అర్జున్‌, సమంతలపై పాటను కంపోజ్‌ చేస్తున్నారు.

Read More »

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికి మంత్రి పేర్ని నాని నివాళి

‘తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల’ అని ఎపి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ… తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని పేర్కొన్నారు. ఎపి ప్రజల తరపున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి ఎపి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Read More »