టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె.. ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో సూచించారు.
Read More »Monthly Archives: January 2022
కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ
కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎపిలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాలని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని వివరించారు.
Read More »వరుణ్ తేజ్కు చిరంజీవి శుభాకాంక్షలు
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, రెనారుసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. జనవరి 19న వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్ర టీజర్ను విడుదల చేశారు.ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్తో కనిపిస్తున్నారు. టీజర్ విడుదలకు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా ...
Read More »వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక భూములమీద లిటిగేషన్ లేని పరిస్థితి వస్తుందని, ఆ ప్రక్రియ చేయడం కోసమే ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే చేపట్టామని, తొలిదశలో 50 గ్రామాల్లో పూర్తి చేశామన్నారు. మంగళవారం నుంచి 37 గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. రాబోయే 3 వారాల్లో మిగతా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామన్నారు.
Read More »విడాకులు తీసుకోనున్న ధనుష్, ఐశ్వర్య దంపతులు
తమిళ హీరో ధనుష్, సూపర్స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ’18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరు అర్థం చేసుకొని మా ప్రయాణాన్ని కొనసాగించాం. అయితే ఇప్పుడు మేము విడిపోవాలని నిర్ణయించుకొని..వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం’ అని ధనుష్ ట్విటర్లో పోస్టు చేసిన లేఖలో పేర్కొన్నారు.మరోవైపు ధనుష్ పోస్టు చేసిన లేఖనే ...
Read More »చిత్తూరు జల్లికట్టులో 30 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో 30 మందికి పైగా గాయపడ్డారు. నిన్న చిత్తూరులో నిర్వహించిన జల్లికట్టు ఆట ‘పశువుల పండుగ’లో పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చినవారితోపాటు వందలాదిమంది పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి, చంద్రగిరి మండల పరిధిలోని వార్షిక కార్యక్రమంలో 500 పైగా ఎద్దులు, వందలాది గ్రామస్థులు పాల్గొన్నారు. నివేదిక ప్రకారం… జల్లికట్టు వేడుకలో 30 మందికి పైగా గాయపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండుపల్లి మండలం ...
Read More »26న ధియేటర్లలో సందడి చేయనున్న అల్లుఅర్జున్ ‘ ఆ’ సినిమా
ఐకాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-1… ధియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఆయన మరో చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది. పుష్ప పార్ట్ 1 ఓటీటీల్లోకి వచ్చేసింది కదా… మాకు తెలియకుండా ఇంకో సినిమా ఏంటనుకుంటున్నారా.. అదేనండి అలా వైకుంఠపురం. అదేంటీ అల్రెడీ రిలీజ్ అయ్యింది అనుకుంటున్నారా.. తెలుగులో కాదండి.. హిందీలో ఈ సినిమా సందడి చేయనుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి.. ఈ నెల ...
Read More »సంక్రాంతి వేడుకలలో సిఎం జగన్ దంపతులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. వేడుకల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులతో సీఎం జగన్ సరదాగా కాసేపు ముచ్చటించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని పేర్కొన్నారు. ప్రతి ఇంట ఆనందాలు వెల్లి విరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Read More »మరింత బెటర్గా పుష్ప-2
అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప. డిసెంబర్ నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్మీడియాలో స్పందించారు. సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ…’ మేము మీకు వాగ్దానం చేస్తున్నాం, పుష్ప సీక్వెల్ మరింత బెటర్గా, బిగ్గరగా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా.. మీ ప్రేమ మరింత కష్టపడేలా చేస్తుంది’ అని పోస్టు చేసింది.
Read More »జగన్ ను కలిసిన చిరంజీవి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సీఎం జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. సీఎం జగన్ చిరంజీవి ని ఇంటి బయటకు వచ్చిమరీ ఆహ్వానించారు. ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Read More »