లౌకికవాదులుగా చెప్పుకునే వారంతా ఏకతాటిపైకి రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘అరబిందో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై నేను నిన్న స్టాలిన్ (తమిళనాడు ముఖ్యమంత్రి)తో మాట్లాడాను. అంతకు ముందురోజు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడాను’ అని సోమవారం ఒక బెంగాలీ ఛానల్కు మమత తెలిపారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ ఎలా ధ్వంసం చేస్తున్నారో, రాజ్యాంగం ఎలా నాశనం చేస్తున్నారో వంటి అంశాలతో పాటు అనేక సమస్యలపై వీరితో మాట్లాడినట్లు చెప్పారు. ‘ఇది నా బాధ్యత కాదు. ఇది అందరి బాధ్యత. ...
Read More »Monthly Archives: February 2022
మే 27న ‘ఎఫ్3’
వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్గా వ్యవహరిస్తున్నారు. సోమవారం వాలంటైన్స్ డే సందర్భంగా చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ, ‘ఎఫ్3’ మే 27న థియేటర్లలోకి వస్తున్నట్లు వెల్లడించింది. ”పిల్లలు పరీక్షలు ముగించుకోండి.. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి.. ఫన్ పిక్నిక్కి డేట్ ఫిక్స్ చేశాం!” అంటూ ...
Read More »నేడు మూడు రాష్ట్రాల్లో పోలింగ్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాగే గోవాలో ఈరోజు రెండవ దశలో 55 స్థానాలు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు జరిగిన ఓటింగ్లో మూడు రాష్ట్రాల్లోని మొత్తం 165 అసెంబ్లీ స్థానాల్లో 1519 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈరోజు యూపీలో దాదాపు 2.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముస్లింలు, దళితులు, రైతులు ఈ దఫా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు.
Read More »సర్కారు వారి పాట నుండి ‘కళావతి’ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మహేష్-కీర్తి సురేష్ జంటగా వస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట నుండి కళావతి సాంగ్ వచ్చేసింది. నిజానికి ఈపాటని వేలంటైన్ డే రోజున రిలీజ్ చేయాలనున్నారు. అయితే.. శనివారమే ఈ పాట లీకవడంతో లీక్ సాంగ్ తో ఒరిజినల్ ఫీల్ పోతుందని భావించిన మేకర్స్ ఆదివారమే ఈ పాట విడుదల చేసేశారు.
Read More »మోహన్ బాబు, లక్ష్మీప్రసన్నల సినిమా ప్రారంభం
శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. మొట్టమొదటిసారి ‘పద్మశ్రీ’ డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ...
Read More »బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లికి హాజరైన జగన్
మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహ వేడుక శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను సందీప్ వివాహమాడారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Read More »జగన్తో చర్చలు సఫలం, కొద్ది రోజుల్లో గుడ్ న్యూస్
సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని.. దీనిపై శుభం కార్డు పడినట్టుగా భావించొచ్చని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఐదో షోకు అనుమతివ్వడం శుభపరిణామమని ఆయన తెలిపారు. గురువారం సిఎం జగన్తో.. మహేష్బాబు, ప్రభాస్, కొరటాల శివ, అలీ, ఆర్. నారాయణమూర్తి, రాజమౌళి తదితర సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. అయితే హీరో నాగార్జున తన భార్య అమలకి కరోనా సోకడంతో చివరి నిమిషంలో ఈ చర్చల్లో పాల్గొనలేకపోయారు. ...
Read More »జగన్ ను కలిసిన టాలీవుడ్ స్టార్స్
అందరికీ న్యాయం జరిగేలా సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సినీ ప్రముఖులు చిరంజీవి,మహేష్బాబు, ప్రభాస్, రాజమౌళి, నిరంజన్రెడ్డి, ఆర్ నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణ మురళీ, కొరటాల శివ, మహి రాఘవలు ముఖ్యమంత్రితో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కూడా పాల్గన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సినిమా పరిశ్రమ ...
Read More »ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి వైసిపి ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు తొలిప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని కాపవరంలో మంగళవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో వారిద్దరితో పాటు జెడ్పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు, మహిళా పక్షపాతి అని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో పంట సాగు నుంచి కొనుగోలు వరకూ ...
Read More »నటి జయసుధకు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా సహజనటి జయసుధ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక జయసుధకి కరోనా అని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అభిమానులు సహా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read More »