ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్ సెస్ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు సంబంధించి ఏపిఎస్ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆర్టీసీ రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని వివరించారు. డీజిల్ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం ...
Read More »Monthly Archives: April 2022
‘ఆదిపురుష్’లో మరో హీరోయిన్
ప్రభాస్ బాలీవుడ్లో చేస్తున్న స్ట్రైట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ను జరుపుకుంటోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ నటిస్తుండగా, ఇప్పుడు సోనాల్ చౌహాన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక ...
Read More »బాధ్యతల్ని స్వీకరించిన పలువురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నూతన మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంగళవారం పలువురు మంత్రులు ఆ శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించి.. సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే విద్యాశాఖామంత్రిగా నియమితులైన బొత్ససత్యనారాయణ కూడా ఆ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రవాణాశాఖామంత్రిగా పి. విశ్వరూప్ బాధ్యతలు చేపట్టారు.
Read More »తండ్రి కలను నిజం చేసిన ఆలీ కుమార్తె
‘సీతాకోక చిలుక’ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ను ప్రారంభించిన అలీ.. అప్పటి అగ్రకథానాయికల సరసన కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. స్టార్ కమెడియన్గా గుర్తింపు సంపాదించుకున్నారు. తనకున్న బిజీ లైఫ్లో ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. తాజాగా అలీ ఓ గుడ్న్యూస్ను సోషల్మీడియా వేదికగా పంచుకున్నారు. తన పెద్ద కుమార్తె ఫాతిమా డాక్టర్ అయిందని.. ఆమె తమ కుటుంబంలో మొదటి డాక్టర్ అని తెలియజేస్తూ.. కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. తన కుమార్తె డాక్టర్ ...
Read More »ఏపీలో కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం
: రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్ ప్రదేశం వద్ద వేదికను ఏర్పాటు చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేశారు.అనంతరం అంజాద్ బాషా (కడప), ఆదిమూలపు సురేశ్ (ఎర్రగొండపాలెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బూడి ముత్యాల నాయుడు(మాడుగుల)తో గవర్నర్ ప్రమాణం ...
Read More »ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి !
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనున్నది. ఒక ఇంటర్వ్యూ లో దీపికా మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం వచ్చిందని, చాలా రోజులగా ఆయన పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. ఆయన నటన అంటే తనకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇక కొరటాల ఆఫర్ రాగానే వెంటనే దీపికా ...
Read More »కేబినెట్లో 8 మంది పాతవారిని కొనసాగించే అవకాశం!
మంత్రివర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చిస్తున్నారు. కొత్తగా అధికారం చేపట్టనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా లేఖలు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత కేబినెట్ నుంచి 8 నుంచి 10మందిని కొనసాగించే అవకాశం ఉంది. కుల సమీకరణ, కొత్త జిల్లాను పరిగణనలోకి తీసుకుని మిగతావారిని ఎంపిక చేసేందుకు తుది కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
Read More »సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంకో విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఆయన పుట్టినరోజు నాడే కన్నుమూయడం. ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read More »‘ఎల్లో పార్టీ, మీడియాల కడుపు మంటకు మందే లేదు’: జగన్
పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గన్న ఆయన.. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారంటూ జాలిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్న జీఈఆర్ రేషియో, ప్రభుత్వ బడులలో ...
Read More »వెయ్యి కోట్ల మైలు రాయిని దాటిన ‘ఆర్ఆర్ఆర్’
రాజమౌళి తాజాగా చెక్కిన చిత్ర శిల్పం ఆర్ఆర్ఆర్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా.. భారీ వసూళ్లతో దూసుకెళుతుంది. వెయ్యి కోట్ల వసూళ్ల రాబట్టుకొని మరో మైలు రాయికి చేరుకుంది. ఇటు మాలీవుడ్ నుండి అటు బాలీవుడ్ వరకు ప్రేక్షకులు కనక వర్షం కురిపిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ వ్యయం నాలుగేళ్లు కష్టించి తీర్చిదిద్దిన చిత్రానికి భారీ స్పందన రావడంతో రూ. 1000 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్లోనే రూ. 200 కోట్లు ...
Read More »