ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన రాజమౌళి.
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన రాజమౌళి.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన రాజమౌళి

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలంతా ఇంటి పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా కుటుంబ సభ్యులకు సాయంగా ఉండాలంటూ మిగతా సెలబ్రిటీలకు సైతం సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌లకు, బాహుబలి నిర్మాతలకు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కిరవాణిలకు కూడా రాజమౌళి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. ‘నా వంతు అయ్యింది సందీప్‌.. ఇప్పడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల వంతు వచ్చింది. ఇప్పుడు చూడండి అసలైన సరదా.. అలాగే శోభు సుక్కు, ఆర్య సుక్కు, పెద్దన్న ఎమ్‌ఎమ్‌ కీరవాణి కూడా ఈ ఛాలెంజ్‌ ఇస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు