ఏపీలో ఆసరా పథకం ప్రారంభం

ఏపీలో మరో పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. డ్వాక్రా సంఘాలకు ఉన్న బ్యాంకు రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చారు. అంతేకాదు త్వరలో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు నిర్వహించాలన ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,71,302 లక్షల డ్వాక్రా సంఘాలకు చెందిన 87,74,674 లక్షల మహిళలకు ఆసరా పథకంలో ఆర్థిక సహాయం అందనుంది.

మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు సీఎం. 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. కొంతమంది కావాలనే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని.. త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. అర్హత ఉన్నా పొరపాటున ఆ జాబితాల్లో పేర్లు లేని సంఘాలు ఏవైనా ఉంటే, వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, విచారణ చేసి మంజూరు చేస్తారు. ప్రభుత్వం ఇప్పుడు జమ చేస్తున్న మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్నది మహిళలదే నిర్ణయం. పాత బాకీల కింద ఆ మొత్తం జమ చేసుకోకుండా బ్యాంకర్లతో మాట్లాడిన ప్రభుత్వం.. వాటిని అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేస్తోంది. ఒక వేళ ఆ డబ్బుతో సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.