సచివాలయ ఉద్యోగులకు జగన్‌ గుడ్‌న్యూస్‌

విజయ దశమి రోజు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. సెక్రటేరియట్‌, వివిధ శాఖలకు సంబంధించిన హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్దరించారు.. ఉద్యోగుల ఉచిత వసతిని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం.. సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు.. సచివాలయ సంఘం విజ్ఞప్తిని అంగీకరించిన సీఎం జగన్… వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతిని కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం.. కాగా, సచివాలయ, హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత వసతిని ఎత్తేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కానీ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఉచిత వసతి సౌకర్యాన్ని పునరుద్ధరించింది. సీఎం వైఎస్‌ జగన్‌ తాజా ఆదేశాలతో సచివాలయ, హెచ్‌వోడీల్లో పని చేసే ఉద్యోగులకు ఊరట లభించింది.. దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి… సీఎం జగన్ పెద్ద మనస్సుతో మా విజ్ఞప్తిని మన్నించారు. ఆర్ధిక కష్టాల్లో ఉన్నా.. ఉద్యోగుల సంక్షేమం గురించే సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.