తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల ఖాతాలోకి నష్ట పరిహారం

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ క్రాప్‌ ఆధారంగా నమోదైన రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట నష్టపరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతులకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లుగా ఉంది.