విశాఖవాసులకు గుడ్‌న్యూస్.

విశాఖవాసులకు గుడ్‌న్యూస్.. ఆ కల నెరవేరబోతోంది

విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ముందడుగులు పడుతున్నాయి. లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది. ఒక కి.మీ ట్రామ్‌ కారిడార్‌ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డీపీఆర్ బాధ్యతల్ని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. లైట్‌ మెట్రోతో పోలిస్తే ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణం తక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.

లైట్‌ మెట్రో రైలు కారిడార్‌ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ట్రామ్‌ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లు అవుతుంది అంటున్నారు. ఇక డీపీఆర్‌ల విషయానికి వస్తే.. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్‌.. ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి చేరనున్నాయి. నగరంలో ట్రాఫిక్‌.. 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్‌ మొదలైన అంచనాలతో డీపీఆర్‌ తయారవుతోంది.