ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. ఎన్నడూలేని విధంగా భారీ భద్రత

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. మొతత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 1.5 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అత్యధికంగా పురుష ఓటర్లు 81,05,236 మంది, మహిళా ఓటర్లు 66,80,277 మంది ఉన్నారు. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఢిల్లీ ఎన్నికల కోసం భారీగా బలగాలను వినియోగిస్తున్నారు. మొత్తం 190 కంపెనీల పారామిలటరీ బలగాలు, 19,000 మంది హోంగార్డులు, 42,000 మంది ఢిల్లీ పోలీసుల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు పంజాబ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో 13,000 మంది పోలీసులను అదనంగా ఢిల్లీ తరలించారు.