ఏప్రిల్ 11న భారతదేశంలో ఈద్ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న జరుపుకోనున్నారు. ఈద్ రోజున ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు మసీదుకు చేరుకొని నమాజ్ చేసి శాంతి కోసం అల్లాహ్ను ప్రార్థిస్తారు. ఒకరినొకరు కౌగిలించుకొని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ 10వ షవ్వాల్ మొదటి రోజు.. రంజాన్ మాసం చివరి రోజు చంద్రుడిని చూసిన ...
Read More »Author Archives: News
భువనగిరి ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభను నిర్వహిస్తారు.
Read More »రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.!
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సిద్ధాంతాల మధ్య సారుప్యతను పోలుస్తూ.. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు! అని చెబుతూ.. ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్, మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం ఎవరు పోరాడారో ...
Read More »వైయస్ఆర్సీపీలోకి భారీగా వలసలు..
ఎన్నికల వేళ తెలుగు దేశం, జనసేన పార్టీల నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్శితులైన టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్. జగన్ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు.
Read More »ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన రఘురాజు..
ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్ తనదేనని ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, ఇద్దరి మధ్యలో ...
Read More »పవన్ కల్యాణ్పై ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి గతంలో బిగ్బాస్ కంటెస్టెంట్గానూ పాల్గొంది. భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
Read More »నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో… సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగసభల్లో వీరు పాల్గొంటారు.ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో ...
Read More »అక్టోబర్లో రానున్న రజినీకాంత్ ‘వేట్టయాన్’
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ ఇచ్చారు. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో రజినీ స్టైల్, ఆ ...
Read More »ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి ‘ప్రేమలు’
మలయాళంలో ఈ మధ్య కాలంలో సంచలనాన్ని నమోదు చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’. నస్లేన్ .. మామితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. కేవలం 3 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ 135 కోట్లను కొల్లగొట్టింది. అక్కడ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, మార్చి 8వ తేదీన తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ ...
Read More »అల్లు అర్జున్.. చీర షాట్ కోసం ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే
అల్లు అర్జున్, సుకుమార్ కాంబో తెరకెక్కిన సినిమా పుష్ప: ది రూల్. మూవీ టీమ్ టీజర్ ను విడుదల చేయడంతో చూసే ప్రేక్షకుల్లో కూడా పూనకాలు తెప్పించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా టీజర్లో జాతర లుక్ హైలెట్.. అయితే, ఇప్పుడు చీర షాట్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చీర ధరించిన అల్లు అర్జున్ పవిట కొంగును కాలితో పైకి లేపుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. అందరి లుక్ దీనిపైనే పడింది. ఈ ఒక్క నిమిషం టీజర్ ని కరెక్ట్ గా కట్ ...
Read More »