విజయవాడ ఈస్ట్.. రాష్ట్రంలోని హాట్సట్లలో ఒకటి. దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా, మాజీ CM నాదెండ్ల భాస్కరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక్కడ 1983లో TDP గెలిచింది. ఆ తర్వాత 2014, 19లో వరుసగా నెగ్గిన గద్దె రామ్మోహన్ మరోసారి TDP నుంచి పోటీకి సై అంటున్నారు. YCP నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.
Read More »Author Archives: News
వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్
ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.
Read More »18 ఏళ్ల తర్వాత అజిత్ త్రిపాత్రాభినయం..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నాడు. స్టార్ హీరోగా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించి..వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయిదే ప్రస్తుతం విడాయమర్చి సినిమాలో త్రిష తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ ...
Read More »జాన్వీకి షాక్ ఇచ్చిన బోనీ..
జాన్వీ కపూర్ – శిఖర్ పహరియాతో పబ్లిక్ గా చాలా సార్లు కనిపించిన.. తమ రిలేషన్ ను అఫిషియల్ చేయలేదు. అయితే ఆ పని తన తండ్రి బోనీ కపూర్ చేసేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్న ఆయన.. శిఖర్ లాంటి అబ్బాయి తమ జీవితాల్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. జాన్వీ గతంలో తనకు దూరంగా ఉన్నా.. తాను, అర్జున్ కపూర్ మాత్రం శిఖర్ తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామని చెప్పాడు. మొత్తానికి ఇద్దరూ మళ్లీ ఒక్కటైనందుకు హ్యాపీగా ...
Read More »చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు: బొత్స సత్యనారాయణ
పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని… ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడు అని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండొద్దా అని ...
Read More »పెన్ష న్లపై కీలక అప్ డేట్
పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.
Read More »దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమా..
ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేయబోతున్నాడు. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ భారీ చిత్రంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నటించబోతున్నారని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమాలకు సైన్ చేశారట. వీటిలో ఆల్రెడీ ఒకటి ...
Read More »తంగలాన్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే.. !
విక్రమ్ -మలబార్ సోయగం మాళవిక మోహనన్ నటిస్తున్న మూవీ తంగలాన్ . అయితే ఈ మూవీ నుంచి షేర్ చేసిన మాళవికా మోహనన్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్. ఈ హీరో యాక్టర్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్ . మలబార్ సోయగం మాళవిక మోహనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీలో మాళవిక ఇదివరకెన్నడూ కనిపించని.. డీగ్లామరైజ్డ్ రోల్లో నటిస్తుంది. తంగలాన్ నుంచి షేర్ ...
Read More »భగవద్గీత గొప్పతనాన్ని తెలుపుతూ సినిమా..
కృష్ణుడి తత్త్వం భోదిస్తూ ఇస్కాన్ సంస్థ సనాతన ధర్మాన్ని, శ్రీకృష్ణుడి చెప్పిన భగవద్గీతని వ్యాప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ వారికి తెలియాలని ఓ సినిమాని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కిస్తున్నారు.తెలుగు దర్శకుడు సంతోష్ జాగర్లపూడికి ఈ షార్ట్ ఫిలిం తీసే బాధ్యతని అప్పగించారు. ఈ షార్ట్ ఫిలింకి డివైన్ మెసెజ్ 1 అని పేరు పెట్టారు. దీనికి ఇస్కాన్ ప్రతినిధి సచినందన్ హరిదాస్ కథ అందించగా ...
Read More »ఇప్పుడా వాలంటీర్ల విధులను ఎవరు నిర్వర్తించాలన్న తమ్మినేని సీతారాం..
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై విపక్ష నేతలు కక్ష కట్టారంటూ మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్ర పూరిత చర్య అని విమర్శించారు. వాలంటీర్లకు అధికారాలు అప్పజెప్పడం జరగదని, వారు అందించే సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని… వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన రోజే సీఎం జగన్ చెప్పారని తమ్మినేని సీతారాం వివరించారు. అదే ...
Read More »