మరో మలయాళ చిత్రం తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించిన ‘జల్లికట్టు’ చిత్రం 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి భారతదేశం తరపున వెళ్లనుంది. ఉత్తమ చిత్రాల పోటీలో నిలవనుంది. ”శకుంతలాదేవి, గుంజన్ సక్సేనా, ఛపాక్, గులాబో సితాబో, చెక్పోస్ట్, స్కై ఈజ్ పింక్.. వంటి 27 చిత్రాలను పరిశీలించిన అనంతరం జల్లికట్టును ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డ్ చైర్మన్ రాహుల్ రావైల్ తెలిపారు. మనుషుల్లో దాగున్న క్రూరత్వాన్ని, జంతువుల పట్ల మానవుల తీరును ...
Read More »Cinema
ప్రేమలో పడిన అమీర్ఖాన్ కుమార్తె
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ కుమార్తె ఐరాఖాన్ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్ఖాన్కు ఫిట్నెస్ ట్రైనర్గా వ్యవహరిస్తున్న నపూర్… ఐరాఖాన్కు కూడా లాక్డౌన్ నుంచి ఫిట్నెస్ కోచ్గా మారారు. ఈ క్రమంలోనే నపూర్ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్ఖాన్ ఫామ్హౌస్లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా ...
Read More »కంగనా రనౌత్కు ఊరట
దేశ ద్రోహం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి ఛాందెల్లకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే ఏడాది జనవరి 8 న ముంబయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా విద్వేషం, మత ఉద్రిక్తతను ...
Read More »రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులు
దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని ఆపాలంటూ.. దిశ ఘటన నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. దిశా ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా తీసి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రం విడుదల ...
Read More »ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నా హీరో నాని
నేచురల్స్టార్ నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన తదుపరి చిత్రం ‘శ్యామ్ సింగరారు’చిత్రంలో ఇలా కనిపించనున్నారు. 1960 నాటి ఒక ప్రాత్ర, ప్రస్తుత జనరేషన్కు లింక్గా మరోపాత్రలో నటించనున్నారు. కోల్కత్తా, హైదరాబాద్లలో పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు.ఈ ఏడాది ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాహుల్ సంక్రిత్యాన్ ...
Read More »బేబీ బంప్లో అనుష్క శర్మ
కరోనా పుణ్యమా అని బిజీ బిజీగా ఉండే సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్రం తిరిగి సినిమా థియేటర్లకు, షూటింగులకు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో సెట్స్లో వడివడిగా అడుగులు పెడుతున్నారు. ఇటీవలే పలువురు బాలీవుడ్ నటులు షూటింగ్స్లో పాల్గొంటున్నారు. తాజాగా నటి అనుష్క శర్మ కూడా సెట్స్లోకి అడుగుపెట్టారు. త్వరలో తల్లి కాబోతున్న ఆమె ..తగు జాగ్రత్తలు తీసుకుంటూ యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు.
Read More »రష్మికకు గూగుల్ గుర్తింపు
నటి రష్మిక మడన్నాకు గూగుల్ ఇండియా అరుదైన గుర్తింపునిచ్చింది. గూగూల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్లో ఈ పదాన్ని టైప్ చేస్తే రష్మిక పేరుతో పాటు ఆమెకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. రష్మిక డ్రస్సింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఆమెకి ఈ గుర్తింపు వచ్చిందని గూగుల్ సమాచారం. ఆమె నటించిన తెలుగు, కన్నడ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్ అయి విడుదల కావడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందట.
Read More »రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా
ప్రభుదేవా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుదేవా.. తన బంధువుల అమ్మాయినే ప్రేమించినట్లు.. ఆమె కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకొన్నదని.. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోకున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం ఊహించని విధంగా.. ప్రభుదేవా సెప్టెంబరులోనే బీహార్కు చెందిన ఫిజియోథెరపిస్ట్ను పెళ్లి చేసుకున్నారని సమాచారం. గతంలో ఆయన వెన్నుముక సమస్యతో బాధపడుతుండగా ఫిజియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియోథెరపిస్ట్తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ ...
Read More »హోం క్వారంటైన్లో సల్మాన్ఖాన్
సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన లాక్డౌన్ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో.. కరోనా బారినపడ్డారు. సల్మాన్ఖాన్ వారిని వెంటనే చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. తాను కుటుంబ సభ్యులకు 14 రోజుల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని హోం క్వారంటైన్లోకి వెళ్లారు. కాగా, కరోనా లాక్డౌన్ సమయంలో సల్మాన్ఖాన్ పన్వెల్లోని ఫామ్హౌస్లో ఉండి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. వాటికి ...
Read More »ఖుష్బూకు తప్పిన ప్రమాదం
సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూకు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారరును ట్యాంకర్ ఢీకొీట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలుపుతూ ఖుష్బూ స్వయంగా ఓ ట్వీట్ చేశారు. ‘కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్ ఢీకొీట్టింది. అయితే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ...
Read More »