Cinema

రామ్‌గోపాల్‌వర్మకు షాక్ ఇచ్చిన సెన్సార్‌బోర్డు

రామ్‌గోపాల్‌వర్మకు సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. ఆయన తీసిన ‘దిశ’ చిత్రం సెన్సార్‌ను బోర్డు రిజెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో రియల్‌ ఎన్‌కౌంటర్‌ సీన్లను పోలిన విధంగా సినిమాలోనూ తీశారు. దీంతో ఈ సినిమాకు సెన్సార్‌ ఇవ్వాలా? లేదా? అని బోర్డు సందిగ్ధంలో పడిపోయింది. దీంతో సినిమాను రివిజన్‌ కమిటీ పరిశీలనకు పంపారు. ఇప్పటికే ఈ చిత్రంపై దిశ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్‌ బోర్డు కూడా ఈ చిత్రం సెన్సార్‌ను రిజెక్ట్‌ చేసింది. దీంతో సినిమా విడుదలపై పలు ...

Read More »

వెంకటేష్’నారప్ప’ పూర్తి

వెంకటేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నారప్ప’ సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. తమిళ ‘అసురన్‌’ సినిమాకు రీమేక్‌గా తెలుగులో వస్తున్న ఈ సినిమా మే 14న థియేటర్‌లో విడుదల కానుంది.

Read More »

మహిళా దర్శకురాలితో మహేశ్‌ బాబు‌ సినిమా ?

అశేష ప్రేక్షకాదరణ పొంది.. ఆస్కార్‌ బరిలో పోటీపడుతోన్న ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు) సినిమాను రూపొందించిన సుధా కొంగర మహిళా దర్శకురాలితో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పనిచేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (శూరరై పోట్రు). ఈ సినిమాకు సుధా కొంగర దర్శకురాలు. ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రస్తుతం మన దేశం తరపున ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్‌ బరిలో పోటీ ...

Read More »

వేసవిలో రానున్న చిరంజీవి ‘ఆచార్య’

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్‌ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి కథనాయుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేసింది.ముఖ్యంగా ఈ టీజర్‌ వాయిస్‌ అంతా రామ్‌చరణే వినిపించారు. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమావనం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే డైలాగులతో టీజర్‌ ప్రారంభమైంది. అలాగే ‘పాఠాలు చెప్పే అలవాటు ...

Read More »

విరాట పర్వం పోస్టర్‌విడుదల

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో  నటిస్తన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకుడు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ  సినిమా విడుదల తేదీని గురువారం చిత్ర బృందం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల చేస్తున్నామని సాయి పల్లవి పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే రానా పాత్ర రవన్న పేరుతో ఓ వీడియోను గతంలో చిత్ర బ‌ృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి ..వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో ...

Read More »

రైతులపై నోరుపారేసుకున్న కంగనా

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నోరుపారేసుకున్నారు. వారిని ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలను పట్టించుకోకూడదని తాను ప్రయత్నించినా మౌనం దాల్చలేకపోయానని పేర్కొన్నారు. ఢిల్లీ హింసపై బిజెపి యువమోర్చా ప్రధాన కార్యదర్శి సౌరబ్‌ చౌదరి ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలను షేర్‌ చేసిన కంగనా.. తన తల సిగ్గుతో వేలాడుతోందని అన్నారు. దేశ సమగ్రతను కాపాడలేకపోయామని, ఈ ఘటనలపై తీవ్రంగా కలత చెందానని, ఇవాళ తాను ...

Read More »

ప్రతి మహిళా పోలీస్‌ ఓ స్టార్‌

ప్రతీ మహిళ పోలీస్‌ ఓ స్టార్‌ అని సినీనటి అనుష్క పేర్కొన్నారు. సైబరాబాద్‌ లో డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అనుష్క ప్రారంభించారు. ఫ్రీ షీ షటిల్‌ బస్‌ లను అనుష్కతో పాటుగా, అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జానార్‌ కలిసి ప్రారంభించారు. అనంతరం ”షీ పాహి”, ఫస్ట్‌ అన్యువల్‌ కాన్ఫరెన్స్‌ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ పోలీస్‌ అధికారులతో పాటు ముఖ్య అతిథిగా అనుష్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఉన్న ప్రతి మహిళ ...

Read More »

జ‌గ‌ప‌తిబాబుకు శిలువ

జగపతి బాబు ప్రస్తుతం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం చేస్తున్నాడు. విద్యాసారగర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జగపతిబాబు అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా చేతులకు శిలువ, నెత్తిన కిరీటం, పొట్టంతా లోపలికి పోయి ఉన్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

Read More »

ప్రెస్‌మీట్‌లో కుప్పకూలిన దర్శకుడు

ప్రదీప్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది విడుదల కాలేదు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ’30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?’ ప్రెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గన్న దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. మీడియాకు, సినీ పరిశ్రమలో తనకు అండగా నిలిచిన స్నేహితులందరికీ కఅతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో ప్రదీప్‌ మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే దర్శకునికి ప్రథమ చికిత్స అందించారు. పనిఒత్తిడి కారణంగానే మున్నా కళ్లు తిరిగి స్టేజ్‌పై పడిపోయినట్లు సమాచారం.

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పాన్‌ ఇండియా లెవెల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు యువకులుగా ఉన్న సమయంలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు ఇంటి నుంచి వెళ్లిపోయి రహస్య ప్రాంతాల్లో ఉంటూ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఏం చేశారు? అనే నేపథ్యంలో ఫిక్షన్‌ కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌కు ...

Read More »