సాయితేజ్ యాక్సిడెంట్ అనంతరం సుదీర్ఘ కాలం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘సాయి తేజ్ రోజురోజుకు మెరుగవుతున్నాడు. గాయాలు మానుతున్నాయి. లేచి కూర్చుంటున్నాడు. మేజర్గా జరిగిన ప్యాక్చర్ తరపు గాయాలు కూడా తగ్గుతున్నాయి’ అంటూ సన్నిహితులు చెబుతున్నారు. ప్రమాదం పెద్దగా జరగడంతో కోమాలోకి వెళ్లిపోవడం.. కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉండటంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక సాయితేజ్ బాగా సన్నబడ్డాడని వార్తలు వస్తున్నాయి.
Read More »news
ఒకేసారి నాలుగు చిత్రాల్లో నిఖిల్!
నిఖిల్ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్పై వివిధ దశల్లో ఉన్నాయి. కరోనాకు ముందు నిఖిల్ ‘కార్తికేయ -2′ సినిమా షూటింగ్ ఆరంభించాడు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ’18 పేజెస్’ మూవీకి కమిట్ అయ్యాడు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీ వాసు, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ...
Read More »‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్
‘పుష్ప’ చిత్రం నుంచి ఓ మాస్ పాట విడుదల కానుంది. ముందుగా ‘సామీ సామీ’ అనే ఈ పాట ప్రోమోను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఈ ప్రోమో చూస్తుంటే శ్రీవల్లి, పుష్పరాజ్ మధ్య మంచి మాస్ బీట్ను ప్లాన్ చేశారనిపిస్తోంది దర్శకుడు సుకుమార్. ఈ మొత్తం పాటను 28న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేశారు. ఈ పాటను గాయని మౌనిక పాడగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ...
Read More »జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు.తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. . సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు రజనీకాంత్ అందుకున్నారు. గత నాలుగు ...
Read More »రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పూజ హెగ్డే హీరోహీరోయిన్గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా శనివారం ఈ మూవీ టీజర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ప్రభాస్ లుక్, డైలాగ్లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
Read More »బాలీవుడ్లో జగపతిబాబు
‘లెజెండ్’ తో రూటు మార్చిన జగపతిబాబుకు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత విలన్ గా, సహాయనటుడుగా దక్షిణాది చిత్రాలన్నింటిలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జగపతి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. బాలీవుడ్ మూవీ ‘పుకార్’లో విలన్ గా నటించబోతున్నాడు జగపతిబాబు. ‘లగాన్’ ఫేమ్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ...
Read More »యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా
నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెల్లువెత్తాయి. సమంత పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్ జుకల్కర్, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల నెగటివ్ వార్తలు సమంతపై సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.విడాకుల విషయంలో సమంతదే తప్పంటూ పలువురు విమర్శించారు. ఇక వీటన్నింటిపై స్పందించిన సామ్.. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ బాధను కలిగిస్తున్నాయని.. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా ...
Read More »క్లోజ్ఫ్రెండ్ తో సమంత డెహ్రాడూన్ టూర్
సమంతా క్లోజ్ ఫ్రెండ్తో కలిసి డెహ్రాడూన్ టూర్ వెళ్లింది. ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ తర్వాత నాగచైతన్యతో విడాకులు తీసుకోనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే… వీరి విడాకుల ప్రకటన అనంతరం… సోషల్మీడియాలో నాగచైతన్య కంటే సమంతనే ఎక్కువగా ట్రోల్ చేశారు. అంతేకాదు… ఆమె కెరీర్ డౌన్ అవుతుందని అనుమానాలూ వ్యక్తం చేశారు. అయితే నెటిజన్ల విమర్శలకు, అనుమానాలకు సామ్ ధీటుగానే స్పందించింది. తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆమె విజయదశమి రోజున ప్రకటించింది. తన వ్యక్తిత్వంపై చేస్తున్న విమర్శలకు ...
Read More »25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్
మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ ...
Read More »విష్ణు గెలుపు కోసం బిజెపి పనిచేసింది
మా ఎన్నికల్లో పలువురు రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారని, విష్ణు గెలుపు కోసం బిజెపి పనిచేసిందని ప్రకాశ్రాజ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. ”మా’ అసోసియేషన్లో ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. తనకంటూ ఒక పవర్ ఉండేదని, అసోసియేషన్ అభివఅద్ధి కోసం నేను అనుకున్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయగలిగే వాడినని అన్నారు. తనను విశ్వసించి ఓటు ...
Read More »