నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘చెక్’ సినిమా ఈనెల 26న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటించాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు. సాయిచంద్ చెస్ కోచ్గా నటించాడు. సినిమాలో 70 శాతం చిత్రీకరణ జైలులోనే సాగుతుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని దర్శకుడు అంటున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ఈ తరహా కొత్త సినిమాలు తెలుగులో వస్తాయని నిర్మాత ఆనంద ప్రసాద్ ఆశిస్తున్నారు.
Read More »news
నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నరవితేజ
రవితేజ నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలస్తున్నాయి. తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్టీ వర్క్స్’ పేరుతో ఆయన ఒక బేనర్ను రిజిస్టర్ చేయించాడని సమాచారం. ఈ బేనర్లో యంగ్, టాలెంటెడ్ ఆర్టిస్టులను, దర్శకులను పరిచయం చేస్తూ చిన్న, మీడియం బడ్జెట్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. ఇన్నేళ్ల తన కెరీర్లో తోడ్పాటు అందించిన వాళ్లకు ఈ బేనర్ ద్వారా అవకాశాలు అందించడంతో పాటు తనలా ఏ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన యంగ్ టాలెంట్కు చేయూత అందించేందుకు రవితేజ ఈ బేనర్ పెట్టడాని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read More »నిర్మాతగా చిన్నారి పెళ్లికూతురు
‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్ నిర్మాతగా మారారు. ఆచార్య క్రియేషన్స్ బేనర్పై ‘నెపోలియన్’ చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో అవికా గోర్, సాయి రోనక్ హీరో హీరోయిన్లు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.
Read More »‘చావు కబురు చల్లగా’సాంగ్లో అనసూయ
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమా ఐటమ్ సాంగ్లో అనసూయ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు.
Read More »శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. రామ్చరణ్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా ప్యాన్ ఇండియా చిత్రం రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు.
Read More »రాముడిగా మహేష్ బాబు .. రావణుడిగా హృతిక్..?
టాలీవుడ్ సినీ ఇండిస్టీలో ఇతిహాసాల పర్వం మొదలైంది. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండగా..సమంత ప్రధాన పాత్రధారిగా శాకుంతలం రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవకు చెందిన చిత్రంలో స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సూపర్స్టార్ మహేష్ బాబు రాముడిగా..మరో బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ రావణుడిగా… దీపికా పదుకొనే సీతగా ఇతిహాస చిత్రం పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సుమారు 1500 కోట్ల బడ్జెట్తో.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఎప్పటినుంచో రాజమౌళి మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని… దానికి కథ ...
Read More »‘నాట్యం’లో ఎన్టీఆర్ వాయిస్
కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘నాట్యం’. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా టీజర్ను ఎన్టీఆర్ రేపు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం. నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మిస్తోన్న నాట్యం చిత్రాన్ని రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు సంధ్యరాజు. ఈ ప్రాజెక్టులో కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read More »తమిళ చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్డామ్లో (ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్ అనే చిత్రం ‘టైగర్ అవార్డు’ దక్కించుకుంది. ఈ అవార్డ్ దక్కించుకున్న తొలి తమిళ చిత్రం కూజంగల్ కాగా, ఈ చిత్రాన్ని పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించారు. నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. చిత్రానికి టైగర్ అవార్డ్ దక్కడంతో క్యూట్ కపుల్ నయన్, విఘ్నేష్లు కలిసి నెదర్లాండ్స్లోని ఐఎఫ్ఎఫ్ఆర్ కార్యక్రమంలో చిత్ర బృందంతో ఫొటోలు దిగారు. టైగర్ అవార్డ్ దక్కించుకున్న రెండో ఇండియన్ చిత్రం ...
Read More »హీరో సూర్యకు కరోనా పాజిటివ్
హీరో సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. తాను కరోనాతో బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నానని, మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదని అన్నారు. అలాగని భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కరోనా నుండి కోలుకునేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.
Read More »అల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం.
ల్లు అర్జున్ కార్వాన్ కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం బన్నీ పుష్ప షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఖమ్మం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్రయూనిట్ ప్రకటించింది. కానీ అప్పుడు కార్వాన్ లో సినిమా మేకప్ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పుష్ప’ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మికా ...
Read More »