ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏడు నెలల కిందటే కర్ణాటకకు చెందిన బాల మేధావి అభిగ్య ఆనంద్ చెప్పిన జోస్యం అక్షరాలా ఫలించడంతో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గ్రహస్థితులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని ఈ మేధావి ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఏడు నెలల కిందట వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని… చైనా యుద్ద సమస్యలను ఎదుర్కొంటుందని ప్రకటించాడు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలమవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని వివరించాడు.
ఫైనాన్షియల్ అస్ట్రాలజీలోనూ ఆయన ఆలోచనా విధానం అమోఘం. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూడా విశ్లేషణ చేశాడు. ఆగస్టు 2019లోనే అభిగ్య ఆనంద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియోను అభిగ్య పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు మే 31 వరకు ఉంటుందని జోస్యం చెప్పాడు. మే 31 వరకు వైరస్ ముంగిపును గుర్తించలేరు, కానీ కేవలం రెండు రోజులు ముందే ఇది అదుపులోకి వస్తుందని వెల్లడించాడు. అభిగ్య వీడియో ప్రకారం.. జూన్ 30 వరకు ప్రపంచం ఎలాంటి శుభవార్త వినదని, ఈ విపత్తు కొనసాగుతుందన్నారు.
జులై ప్రారంభం నుంచి సానుకూల ఫలితాలు ఉంటాయని, వైరస్ తగ్గుతుందన్నారు. జూన్ నుంచి డిసెంబరు మధ్య వరకూ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయని తెలియజేశారు. వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారని, మే 4 వరకు ప్రజలు తీవ్ర ఆహారలేమిని ఎదుర్కొంటారని తెలిపారు. అంతేకాదు, ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచానికి మరో విపత్తు పొంచి ఉందని, అది 2021 మార్చి 31 వరకు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ప్రమాదికారని, దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని అన్నాడు. 2021 మార్చి 31 వరకు ఇది ప్రపంచాన్ని పీడిస్తుందన్నారు.