ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాలపై సోమవారం సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫార్మర్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు తీసుకొస్తే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఆ డెబిట్ కార్డు ద్వారా రైతుకు అందాలన్నారు. సంబంధిత బ్యాంక్కు వెళ్లి కార్డు చూపగానే రైతు చేతికి డబ్బు ఇచ్చేలా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఖరీఫ్ కల్లా 56 లక్షల క్రెడిట్, 56 లక్షల డెబిట్ కార్డులు సిద్ధం చేయాలని సూచించారు.