సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ను ప్రారంభించిన జగన్

 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు రూపొందించిన నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. ఒకే పోర్టల్‌ కిందకు వేర్వేరు శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు ప్రజలకు అందాయి. ఇంకాస్త వేగంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను రూపొందించింది.