రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 18 దిశ పోలీస్ స్టేషన్లలో తొలి స్టేషన్ ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
