శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు

అక్కినేని నాగార్జున తిరుమల తిరుమతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తన భార్య అక్కినేని అమలతో కలిసి తిరుమల చేరుకున్నారు. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో నాగార్జున దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత వీరిని ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.