పల్నాడులో అల్లర్ల కేసుల విచారణ కొనసాగుతోంది. నేడు పల్నాడులో సిట్ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మాచర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో విచారణ చేయనుంది సిట్ బృందం. గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు అయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదు అయ్యాయి.