26న ‘కళాపురం’

‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రాల ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళాపురం’. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను కీలక పాత్రల్లో నటించారు. రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కరుణ కుమార్‌ మాట్లాడుతూ ”ఇప్పటివరకు కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేశాను. ‘కళాపురం’ కామెడీ సినిమా. అయితే కామెడీలో అశ్లీలత ఉండదు” అని తెలిపారు. ”క్యూట్‌ కామెడీ చిత్రమిది” అని సత్యం రాజేశ్‌, ”చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి పాత్ర చేశాను” అని చిత్రం శ్రీను మాట్లాడారు.