**EDS: VIDEO GRAB** New Delhi: Opposition leaders stage a protest in Rajya Sabha during the Winter Session of Parliament, in New Delhi, Monday, Nov. 29, 2021. (RSTV/PTI Photo)(PTI11_29_2021_000093B)

12 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌

లోక్ సభ సమావేశాలు మొదలైన కాసేపటికే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయడంతోపాటు లఖీంపూర్ ఖేరీ ఘటనపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. పన్నెండు మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే రాజ్య సభ చైర్మన్ దీనికి అంగీకరించకపోవడంతో ఇరు సభల నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.