ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ అని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మన సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆంధ్రా మాకు అతిపెద్ద బహుమతి ఇచ్చింది. చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు నాతో చెప్పారు.