కరోనా దెబ్బకు బయపడ్డ బాహుబలి

కరోనా దెబ్బకు బయపడ్డ బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మాస్క్‌తో కనిపించాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో, ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. తర్వాతి షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ యూరప్ బయల్దేరింది.

ప్రభాస్ తెల్లవారు జామున ఎయిర్ పోర్టులో మాస్కుతో కనిపించడంతో తోటిప్రయాణికులు, సిబ్బంది గుర్తుపట్టి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభాస్ తన 21వ సినిమాను ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.