‘రామారావు మాస్‌ నోటీస్‌’

రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామారావు మాస్‌ నోటీస్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్‌, నరేష్‌, పవిత్ర లోకేష్‌, చైతన్య కష్ణ, తనికెళ్ల భరణి ఇతర పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు.