ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు అందడంతో పోలీసులు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజా సింగ్పై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్కు గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్హట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఇంటికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో రాజాసింగ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
