రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రమోషన్లో భాగంగా ఆరు రోజులు పాటు దేశంలోని రాష్ట్రాల్లో ప్రచారం పెట్టుకుంది చిత్రబృందం. ఈ మేరకు సోషల్మీడియా వేదికగా లొకేషన్ల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది. దుబాయ్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, కోల్కతా, వారణాసి, హైదరాబాద్ నగరాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు. కోవిడ్ కారణంగా తరచూ వాయిదా పడిన ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.