జేసీ బ్రదర్స్‌కు బిగ్ షాక్.. ఏకంగా రూ.100 కోట్లు!

జేసీ బ్రదర్స్‌కు బిగ్ షాక్.. ఏకంగా రూ.100 కోట్లు!

జేసీ బ్రదర్స్‌ను ట్రావెల్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. రవాణాశాఖ అధికారులు, పోలీసుల సంతకాలు ఫోర్జరీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. జేసీ ట్రావెల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేసులు నమోదు చేయాలని పోలీసుల్ని కోరామని రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు.

సుప్రీంకోర్టు పర్యావరణాన్ని రక్షిచేందుకు 2017లో బీఎస్‌-3 వాహనాలు నిషేధిస్తూ తీర్పునిచ్చిందని.. నిబంధనలకు విరుద్ధంగా అనంతపురం జిల్లాలో 68 నిషేధిత బీఎస్‌-3 వాహనాలు గుర్తించారు. వీటిని స్క్రాప్ కింద విక్రయించామని అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తమకు వివరాలు పంపించింది. కానీ నాగాలాండ్‌ బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా మార్చేసి.. ఆరు వాహనాలు జేసీ బ్రదర్స్ అనుచరుడు చవ్వా గోపాల్‌ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలిందట.