కృష్ణా నదిలోభూకంపం..!.. ఉలిక్కిపడ్డ నల్లమల

ఎప్పుడూ లేని రీతిలో నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో నల్లమల ప్రాంతంలోని పలు ఊర్లు ప్రభావానికి గురయ్యాయి. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి వారిలో ఆందోళనకు గురి చేసింది. భూప్రకంపనల తీవ్రత 3.7గా గుర్తించారు. భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రీశైల జలశయానికి పడమర వైపు 44 కి.మీ. దూరంలో.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు తూర్పున 18 కి.మీ. దూరంలో కృష్ణా నదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లుగా చెబుతున్నారు.