Tag Archives: ap assembly

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. గవర్నర్‌ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేసారూ టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్..అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాగా, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ.. విజయవాడలో బీఆర్‌ ...

Read More »

చివరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ బీసీఏ సమావేశాలు జరగనున్నాయి. మరీ కొన్ని నెలల్లో పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు 3 రోజులు మాత్రమే జరుగుతాయని సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ కూడా అవసరం ...

Read More »

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) నిర్ణయించింది. మొత్తం 13 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా టిడిపి సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై సిఎం జగన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘ గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు ‘ వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని సిఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ముఖ్యమంత్రి జగన్‌ టిడిపి నేత అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. మరోవైపు వెలగపూడిలోని ...

Read More »

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read More »

ఐదో రోజు అసెంబ్లీ స‌మావేశాలు

 అమరావతి: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు మరో 9 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు ఏపీఎస్‌ఆర్టీసీ, కార్మికశాఖ వార్షిక ఆడిట్‌ రిపోర్టు తీసుకురానుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వైద్యంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన 11 బిల్లులను నేడు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్‌ సంస్కరణలు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా సౌకర్యాలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Read More »

ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన 10 మంది మాజీ సభ్యులకు శాసనసభలో నివాళులర్పించారు. బద్వేలు ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ ఒక్క రోజే సమావేశం నిర్వహించాలని భావించగా.. టిడిపి పొడిగించాలని కోరిన పిదప.. బిఎసి సమావేశంలో ఈ నెల 26 వరకు  సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.  అసెంబ్లీ ఆరు నెలల కాలంలో ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీతో ఆరు నెలలు పూర్తికావస్తున్నందున.. గురువారం నుండి ...

Read More »

ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీవరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులకు సంతాపం ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Read More »

18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ భేటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను 16వ తేదీన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకరు నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల స్పెషల్‌ సిఎస్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ శాసనసభ సచివాలయ కార్యదర్శి లేఖ రాశారు. ఇదే సమయంలో 17వ తేదీన మంత్రివర్గం కూడా ...

Read More »

ఏపీ బడ్జెట్‌ ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం ...

Read More »

ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరుగనున్నాయి. శాసనసభ సమావేశాలు ఒక్కరోజే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాక సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సభలో తీర్మానం చేయనున్నారు.

Read More »