Tag Archives: corona cases

తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డి ...

Read More »

భారత్ లో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా అత్యధికంగా 55,079 కేసులు వెలుగు చూశాయి. గురువారం 779 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 16,38,871కు చేరింది. మొత్తం 35,747 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు

Read More »

భారత్ లో 24 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌ను కరోనా వైరస్‌ వణికిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా కేసులు కనివినీ ఎరుగని రీతిలో నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య నిత్యం పెరుగుతుండటంతో యావత్‌ దేశ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దాదాపు 30 వేలకు చేరువగా కేసులు వెలుగు చూడటంతో దేశంలో కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. మంగళవారం కొత్తగా 29,429 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బయటపడినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారి.దేశంలో ఇప్పటి వరకు ...

Read More »

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9, 07,645కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23,727కు చేరింది. మహారాష్ట్రలో నిన్న(సోమవారం) 6,497 కేసులు నమోదవ్వగా ...

Read More »

24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 19వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. ...

Read More »

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం ద్వారా.. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 477 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 6,988కు చేరింది. కొత్తగా 657 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 15,252కి చేరాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2,036 ఉండగా, విదేశాల ...

Read More »

ఒక్కరోజులో అత్యధికంగా 14,516 కేసులు

ఒక్కరోజులో అత్యధికంగా 14,516 కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకి ఉధృతంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగు లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,95,048కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 375 మంది మరణించడంతో.. మృతుల సంఖ్య 12,948కి చేరింది. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతుండగా, 2,13,830 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మహారాష్ట్రలో 1,24,331 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ...

Read More »

ఏపీలో కొత్తగా 76 కరోనా కేసులు

ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 76 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 76 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,169 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు సంఖ్య 885గా ఉంది.

Read More »

భారత్‌లో కొత్తగా 8,392 కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. నిన్న 8,380 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిన్నటి కంటే ఎక్కువగా 8,392 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 230 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కు చేరింది. ఈ మేరకు సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 91,819మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జవ్వగా.. దాదాపు 93వేల మంది ఆసుపత్రుల్లో ...

Read More »

70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్‌ కేసులతో పాటు 87 మంది బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22454 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ...

Read More »