భారత్లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 ...
Read More »Tag Archives: covid 19
దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నెమ్మదించినా.. కొన్ని దేశాల్లో వైరస్ ఉధృతి అధికంగా ఉంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల వ్యాప్తితో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల అనంతరం ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 8,524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల ...
Read More »25కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్లో రెండు కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. తాజా కేసులతో కలిపి మొత్తం సంఖ్య 25కు చేరుకుంది. డిసెంబర్ 4న జింబాబ్వే నుండి ఓ వ్యక్తి గుజరాత్లోని జామ్నగర్కు రాగా, ఆయనకు చేపట్టిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. జినోమ్ స్వీకెన్స్లో ఒమిక్రాన్గా నిర్ధారణైంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి వైరస్ ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ...
Read More »ఒక్కరోజులో 13 శాతం పెరిగిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,466 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఒక్కరోజులో 13 శాతం మేర పెరుగుదల కనిపించింది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 460 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 4,61,849కిచేరింది. మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,683కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత తక్కువగా నమోదవడం 264 రోజుల ...
Read More »ప్రపంచ దేశాల్లో మరోసారి విజృంభిస్తోన్న కరోనా
పలు దేశాల్లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. రష్యాలో సోమవారం 39,400 పాజిటివ్ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్ కొనసాగుతున్నప్పటికీ.. తొమ్మిది రోజుల లాక్డౌన్ అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుండి రష్యాలో ప్రతి రోజూ 1,100 మంది కరోనాతో మరణిస్తున్నారు. జర్మనీలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వారంరోజులుగా ప్రతి లక్షమందిలో 201 మంది వైరస్ బారిన పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,513 ...
Read More »దేశంలో 10 వేలకు తగ్గిన కరోనా కేసులు
దేశంలో తాజాగా కరోనా కేసులు 10 వేలకు తగ్గాయి. రికవరీ రేటు కూడా 98.23 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం… దేశంలో కోవిడ్ కేసులు ముందురోజు కంటే 14 శాతం మేర తగ్గి..10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, 10,929 కొత్త కేసులు వెలుగుచూశాయి. 392 మరణాలు నమోదయ్యాయి. తగ్గిన రికవరీ రేటు.. క్రియాశీల రేటు..దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు, క్రియాశీల ...
Read More »కరోనా వైరస్ ఇప్పట్లో పోదు : డబ్ల్యుహెచ్ఒ
వైరస్ ఆధీనంలో మనం ఉన్నాం అని కానీ, వైరస్ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించవద్దని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఆగేసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖత్రేపాల్ సింగ్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న ...
Read More »చిన్నారులపై Covaxin ట్రయల్స్ పూర్తి
చిన్నారుల కోవాగ్జిన్ టీకాపై రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ను భారత బయోటెక్ సంస్థ పూర్తి చేసింది. ఈ క్లినికల్ పరీక్షల డేటాను వచ్చే వారంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)కు అందించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కఅష్ణ ఎల్లా తెలిపారు. వయోజనులకు అందించిన టీకా మాదిరిగానే పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుందని అన్నారు. పిల్లల టీకాపై క్లినికల్ పరీక్షల డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. దాదాపు 1,000 మంది వాలంటీర్లపై పిల్లల కోవాగ్జిన్ను ప్రయోగించామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ, ...
Read More »ఏపీలోమళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి ...
Read More »విశాఖలో విద్యార్థులపై కరోనా పంజా..
విశాఖలో పాఠశాల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. నగరంలోని గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్ చేయించారు. కాగా, కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటం.. థర్డ్వేవ్లో పిల్లలపై ...
Read More »