సాగు నీటి వాటాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్న వేళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. హైదరాబాద్లోని జలసౌధలో గురువారం మధ్యాహ్నం మొదలైన సమావేశం సాయంత్రం ఆరుగంటల వరకూ సాగింది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తమ వాదనలను బోర్డు సభ్యులకు వినిపించారు. అనంతరం తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఏపీలో పోలవరం, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నందున ఆ మేరకు తెలంగాణకు అదనపు జలాలు ఇవ్వాలని బోర్డును కోరినట్లుగా ...
Read More »