Tag Archives: mukesh ambani

జగన్ కు ఇచ్చిన మాట నెరవేర్చిన ముకేశ్ అంబానీ

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. గతంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల మేరకు ఈ పెట్టుబడులను ప్రకటించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయా కంపెనీల పెట్టుబడుల విలువ మొత్తం రూ.4,883కోట్లు అని మంత్రి అమర్నాథ్ తెలిపారు.

Read More »

భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ

 రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో అత్యంత ధనవంతుల్లో వరుసగా 14వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది కాలంలో ముకేష్‌ సంపాదన 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.29వేల కోట్లు) పెరిగింది. మొత్తంగా 92.7 బిలియన్‌ డాలర్ల (రూ.6.95 లక్షల కోట్లు) నికర విలువ కలిగి ఉన్నారు. భారత్‌లో టాప్‌ 100 కుబేరుల జాబితాను గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ 100 మంది ధనవంతులైన భారతీయుల మొత్తం సంపద ఏడాది కాలంలో 775 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ...

Read More »

వంద బిలియన్‌ డాలర్ల జాబితాకి చేరువలో ముఖేష్‌ అంబానీ

ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో అరుదైన ఫీట్‌ను సాధించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌ ప్రకారం..ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్ తరువాత స్థానంలో నిలిచారు.     శుక్రవారం ఒక్కరోజే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో రియలన్స్‌ షేర్‌ వ్యాల్యూ 4 శాతం పెరిగి..అంబానీ సంపాదనకు మరో 3.7 బిలియన్ల డాలర్లు చేరినట్లైంది. దీంతో 92.9 బిలియన్‌ డాలర్లతో వరల్డ్‌ వైడ్‌ బిలియనీర్‌ జాబితాలో 11వ స్థానంలో ప్రముఖ కాస్మోటిక్స్‌ సంస్థ లోరియల్‌ వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయరన్‌ను ...

Read More »

సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ సమావేశం జరిగింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై సీఎం జగన్‌తో ముకేష్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌నత్వానీ పాల్గొన్నారు.

Read More »