Tag Archives: vijayasai reddy

చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ప్రతిపక్షనేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ ‘మనవాళ్లు బ్రీఫుడు మీ’ అన్న వాయిస్ మీదేనని పసిపిల్లలూ గుర్తుపట్టారు. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని మీడియా ఇంటర్వ్యూల్లో గద్దించిన సంగతి ఎవరూ మరిచి పోలేదంటూ’’ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుకు చురకలు అంటించారు.‘‘ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అరిచినట్టు లేదూ?’’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Read More »

రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి

రాజ్యసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, మల్లికార్జున్‌ ఖర్గే, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలను బీసీఏ సభ్యులుగా రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు నామినేట్‌ చేశారు. సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ నరసింహారావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.

Read More »

మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి

పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్‌ను ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎంపీలు పినాకిల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మల్లేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Read More »

వైఎస్సార్‌ పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది

వైఎస్సార్‌ పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది

జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుప్తుల కాలాన్ని మరిపించింది. వైఎస్సార్‌ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్ల కు సాగు నీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగ ...

Read More »

సోషల్‌ మీడియా ఫేక్‌ గ్యాంగ్‌లకు ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరిక

సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో సాగిస్తున్న దుష్ర్పచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని అభిప్రాయపడ్డారు.ఫేక్‌ ...

Read More »

చంద్రబాబు పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై ఫైర్ అయిన విజయసాయి రెడ్డి

రాష్ట్రంలో సమస్త ప్రభుత్వ యంత్రాంగం కంటిపై కునుకులేకుండా కరోనా మహావిపత్తుపై పోరాడుతుంటే పొరుగు రాష్ట్రంలో కూర్చున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కరోనా లెక్కలతో కుస్తీలు పడుతున్నారని వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బురదజల్లుడు రాజకీయాలకు ఇది వేళ కాదన్న కనీస స్పృహ లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వాసుపత్రులను గాలి కొదిలేసి, ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించారని ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటిపై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తుంగలో తొక్కాడని, ఆరోగ్య ...

Read More »

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

పలు పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ పిఎల్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, టీఎస్‌ఎన్‌ మూర్తి, రజక సంఘం నార్త్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ...

Read More »

చంద్రబాబు పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

చంద్రబాబు పై పంచులు వేసిన విజయసాయి రెడ్డి

నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదని తెలిపారు. ‘మోపిదేవి, బోస్‌ల పార్టీ విధేయతను గుర్తించి.. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ స్థాయిలో గౌరవిస్తున్నారో చూస్తున్నావు కదా. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎందరికి టికెట్లిచ్చావు? అదే చంద్రబాబుకు, జగన్‌కు ఉన్న తేడా’ అని ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్ట్‌ చేశారు. టీడీపీలో చంద్రబాబు ఎప్పుడూ తన వాళ్లకే పెద్దపీట వేశాడు. బలివ్వాల్సి వచ్చినప్పుడు ...

Read More »

చంద్రబాబు పై రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి

చంద్రబాబు పై రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Read More »

చంద్రబాబు పై సెటైర్లు వేసిన విజయసాయి

చంద్రబాబు పై సెటైర్లు వేసిన విజయసాయి

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు’ అని విమర్శించారు.

Read More »