ప్రమాణస్వీకారానికి ముందే రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు

tdp-voilence-.jpg

ఏపీలో ఈనెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అత్యధిక సీట్లు గెలిచిన కూటమి నేతలు ప్రభుత్వాని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇంతలోనే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులకు పాల్పడుతోంది.ఒకటి రెండు చోట్లా కాదు ఏపీ వ్యాప్తంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఆస్తుల విధ్వంసానికి తెలుగుతమ్ముళ్లు పాల్పడుతున్నారు.దీంతో ఎక్కడ చూసినా భయానక వాతావరణం నెలకొంది.దీనిపై పలువురు నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేకపోవడం గమనార్హం.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది.ఫలితాలు రాగానే వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద దివంగత నేత పేరు ని ధ్వంసం చేశారు. అనంతపురంలో వైస్సార్ బొమ్మ విధ్వంసానికి పాల్పడ్డారు. విశాఖ ఋషికొండ పై ఉన్న ప్రభుత్వ భవనాలపై టీడీపీ జెండాలు నాటారు. ఏలూరులో వైసీపీ సానుభూతిపరుడి దుకాణo పై దాడి చేశారు.నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.ఇళ్లలోకి చొరబడి కత్తులు చూపిస్తూ వైసీపీ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు.ఇలా ఏపీలో వరుసగా జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం సాయంత్రమే గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన్ని కోరారు. అయినా టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.

Share this post

scroll to top