జగన్ ను కలిసిన టాలీవుడ్ స్టార్స్

అందరికీ న్యాయం జరిగేలా సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సినీ ప్రముఖులు చిరంజీవి,మహేష్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, నిరంజన్‌రెడ్డి, ఆర్‌ నారాయణమూర్తి, ఆలీ, పోసాని కృష్ణ మురళీ, కొరటాల శివ, మహి రాఘవలు ముఖ్యమంత్రితో గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కూడా పాల్గన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడటంతో పాటు, ప్రేక్షకులకు భారం కాకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. థియేటర్లలో ఐదో షో ప్రదర్శన అంశాన్నీ కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.